గణపురంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం!

గణపురం మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1987-88 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థులు గత 34 సంవత్సరాల తర్వాత తాము చదువుకున్న పాఠశాల ఊరు ఎవరెవరు ఎక్కడ ఏమి చేస్తున్నారు. అని ఆదివారం మండల కేంద్రంలో గల జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో  స్థానిక సర్పంచ్ నార గాని దేవేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన  పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో 1987 88 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం లో పాల్గొని పరిచయాల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు .అనంతరం ఎవరెవరు ఎక్కడ ఏమి చేస్తున్నారు అని వారి పిల్లలు చేస్తున్న పనులను అడిగి తెలుసుకున్నారు .తీరుతెన్నులను నెమరు వేసుకొని బాగోగులను అడిగి తెలుసు తెలుసుకోవడం జరిగింది . ఈ కార్యక్రమంలో దాదాపు  వందమంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి ,బూరరమేష్ గౌడ్ ,ఆదర్శ్, వేణు, వెంకట్ రెడ్డి , అమర్ నాథ్, వేణు,నీరజా, ఊర్మిళ, రామ, సువర్ణ, కమల సరస్వతి ,ముక్కెర రమేష్ ,మల్లయ్య, శంకర్ ,లక్ష్మణ్,  ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.