గద్వాలలో ధనలక్ష్మి దేవి అలంకరణ 5 కోట్ల 11 లక్షల 11 వేల నూట 11 రూపాయలు

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 30 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాజవీధిలో గల శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో వాసవి మాత అమ్మవారు ధనలక్ష్మి దేవిగా శుక్రవారం భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ధనలక్ష్మి దేవి అలంకరణకు రూపాయలు ( 5,11,11,111 ) ఐదు కోట్ల పదకొండు లక్షల పద కొండు వేల నుట పద కోండు రూపాయలతో ప్రత్యేకంగా అలంకరించారు.ఈ కార్యక్రమంలో గద్వాల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆలూరు బిలకంటి రాము, ప్రధాన కార్యదర్శి నరహరి శ్రీనివాసులు కౌన్సిలర్, ఆర్థిక కార్యదర్శి బిలకంటి సురేష్ మీడియా ఇన్చార్జిలు గౌడంపల్లి నాగరాజు,ఈ.వరప్రసాద్,యువజన సంఘం అధ్యక్షులు భాణాల వెంకటరమణ,ప్రధాన కార్యదర్శి మనుసాని శరత్ చంద్ర,కోశాధికారి మోది వెంకటరమణ,ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు గోవిందు మధుమతి,గట్టు డి రవళి,బాదం జయప్రద,జిల్లా అవోప అధ్యక్షులు మరిడి శ్రీకాంత్, గద్వాల పట్టణఅవోపా అధ్యక్షుడు పి.వీరబాబు,ప్రధాన కార్యదర్శి కొండ వెంకటేష్, గద్వాల పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరీమణులు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నరు.