గన్ లైసెన్స్ ఇప్పించండి
భద్రత కోసం తుపాకీ అవసరమన్న ధోనీ భార్య సాక్షి
న్యూఢిల్లీ,జూన్20(జనం సాక్షి ): తనకు ప్రాణహాని ఉందని, వెంటనే తుపాకీ లైసెన్స్ ఇప్పించాలని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య కోరినట్టు జాతీయ విూడియాలో వార్తలు వచ్చాయి. తనకు తక్షణమే 0.32 రివాల్వర్ ఇవ్వాలని ప్రభుత్వానికి సాక్షి దరఖాస్తు పెట్టుకున్నారని సమాచారం.జాతీయ, అంతర్జాతీయ పర్యటనల దృష్ట్యా ధోనీ ఇంటిలో ఉండే సమయం చాలా తక్కువ. అధిక సమయాలు నేను నా కూతురితోపాటు ఇంట్లో ఒంటరిగానే ఉంటాను. వ్యక్తిగత పనుల నిమిత్తం ఒంటరిగానే బయటకు వెళ్తుంటాను. కాబట్టి నా భద్రత దృష్ట్యా వీలైనంత త్వరగా లైసెన్స్డ్ పిస్టల్ లేదా 0.32 రివాల్వర్ ఇప్పించండి’ అని సాక్షి తన అప్లికేషన్లో పేర్కొన్నారు. కాగా, ధోనీకి 2010లోనే 9ఎమ్.ఎమ్ పిస్టల్కు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ‘క్రికెట్ మ్యాచ్ల దృష్ట్యా ధోనీ ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ. నా కూతురితో కలిసి నేను మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నా. ఏదైనా పని కోసం బయటకు వెళ్లాల్సి వచ్చినా ఒక్కదాన్నే వెళ్లాలి. నా భద్రతను దృష్టిలో పెట్టుకునే నాకు లైసెన్స్డ్ తుపాకీ లేదా రివాల్వర్ ఇప్పించాలి’ అని కోరినట్లు సాక్షి తెలిపింది.2006లో మహేంద్ర సింగ్ ధోనీ కూడా తుపాకీ కోసం అప్లై చేయగా 9ఎమ్ఎమ్ గన్కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధోనీ.. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నాడు. ఇటీవల నిర్వహించిన యో యో టెస్టులో పాసైన ధోనీ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడవిూలో ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటున్నాడు. ఈ నెల 27, 29న ఐర్లాండ్తో భారత్ రెండు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత జులై 3 నుంచి ఇంగ్లాండ్తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది.