పోచంపల్లి అర్బన్ బ్యాంక్ భీమా చెక్కులు అందజేత

భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 07(జనం సాక్షి):

10 నుండి 70 సం. ల వయసున్న ఖాతాదారులందరికి ప్రమాద బీమా వర్తిస్తుంది..

-పోచంపల్లి అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్

భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని పోచంపల్లి అర్బన్ బ్యాంక్ ఖాతాదారులైనటువంటి వెంకటయ్య ఇటీవల విద్యుత్ ఘాతంతో మరణించగా మరియు మహేశ్వరం దత్తాత్రేయ రోడ్డు ప్రమాదంలో మరణించినందున వీరికి పోచంపల్లి శాఖ నందు ప్రమాద బీమా కలిగి ఉన్నందువలన వారి కుటుంబ సభ్యులకు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారి సౌజన్యంతో బిజెపిఏ పాలసీ కింద ఇరువురికి సోమవారం నాడు అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ చేతుల మీదుగా ప్రమాద బీమా లక్ష రూపాయల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. తడక రమేష్ మాట్లాడుతూ.. బ్యాంకు నందు 10 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు ఉన్న ఖాతాదారులకు బిజెపిఏ ప్రమాదం బీమా వర్తిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు కర్నాటి బాలసుబ్రమణ్యం, ఏలే హరిశంకర్, సురపల్లి రమేష్, రాపోలు వేణు, గుండు కావ్య, కర్నాటి భార్గవి, కొండమడుగు ఎల్ల స్వామి, మక్తల నరసింహ, బిట్టు భాస్కర్, బ్యాంకు సీఈవో సీత శ్రీనివాస్, సీనియర్ మేనేజర్ రాచకొండ మధుసూదన్, బ్రాంచ్ మేనేజర్ రచ్చ శ్రీనివాస్ మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.