గిరిజన పక్షపాతి సీఎం కేసీఆర్

– టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు పాషా
మునగాల, సెప్టెంబర్18(జనంసాక్షి): గిరిజన పక్షపాతి సీఎం కేసీఆర్ కోదాడ టిఆర్ఎస్వీ అధ్యక్షుడు పాషా అన్నారు. శనివారం హైదరాబాదులో జరిగిన గిరిజన సమ్మేళన సభలో బంజారా భవన్ ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్, గిరిజన బంధు, పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించడంతో పాషా హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేశరన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్ కె దక్కిందని వెల్లడించారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలనుకున్నారని, గిరిజనులు కోదాడ నియోజకవర్గ ప్రజలు శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ సీఎం కెసిఆర్ నాయకత్వానికి అండగా ఉండాలని కోరారు.