గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి

 

మల్దకల్ ఆగస్టు 8 (జనంసాక్షి) మండల పరిధిలోని అమరవాయి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎండి.ఆసిమ్(39) సోమవారం ఉదయం గుండెపోటుతో గద్వాల ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసిమ్ గతంలో అమరచింత మండలం నందిమల్లలో దాదాపు 8 సంవత్సరాలు పనిచేసే మంచి పేరు సంపాదించాడు.జనవరిలో అమరవాయి పంచాయతీ కార్యదర్శి గా బదిలీపై వచ్చాడు.ఆసిమ్ మృతి పట్ల సింగిల్ విండో అధ్యక్షుడు శేషంపల్లి తిమ్మారెడ్డి, వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటన్న, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సవరణ, ఎంపిటిసి గోపాల్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు తుమ్ కృష్ణారెడ్డి, నాయకులు మహేష్ ,జాన్ తిమ్మన్న ,భాస్కర్ గౌడ్ ,ప్రభాకర్ గద్వాల్ పంచాయతీ కార్యదర్శి స్వగృహంలో పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు.మండల పరిషత్ సిబ్బంది ఎంపీడీవో కృష్ణయ్య ,ఎంపిఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, సూపరిడెంట్ పెద్ద నరసన్న, సీనియర్ అసిస్టెంట్ సూర్య ప్రకాష్ రెడ్డి ,టైపిస్టు రెహమాన్ తో పాటు పలువురు పంచాయతీ కార్యదర్శి ని ఇంటికి వెళ్లి భౌతికాయం పై పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వపరంగా ఆయన కుటుంబానికి ₹20 లను అందజేశారు