గుడ్ షెఫర్డ్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా ఎయిడ్స్ ర్యాలీ

జనం సాక్షి,చెన్నారావుపేట:-మండలంలోని పాపయ్య పేట గ్రామంలోని గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా ఎయిడ్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఎయిడ్స్ గురించి నినాదాలు ఇస్తూ సెంటర్ వరకు విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.అనంతరం సెంటర్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరు కలిసి మానవహారం గా ఏర్పడి ఎయిడ్స్ గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ జోసఫ్ విజయ్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రవణ్ కుమార్ ,హెల్త్ ఇన్చార్జ్ ప్రభ,పి ఈ టి రామచంద్రం,ఉపాధ్యాయులు రవీందర్, రాంబాబు, శంకర్, శంకర్ బాబు, అనిల్, శ్రీనివాస్, రాజు, మోహన్ లాల్ పాల్గొన్నారు.