గురుకుల నియామక పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు..
` 24న హాల్ టికెట్లు విడుదల
హైదరాబాద్(జనంసాక్షి): గురుకుల నియామక పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సీబీఆర్టీ(కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను జులై 24వ తేదీ నుంచి సంబంధిత వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.ఇటీవల విడుదలైన గురుకుల నోటిఫికేషన్ ద్వారా 9 కేటగిరిల్లో 9,210 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలను ఆగస్టు 1 నుంచి 23 వరకు మూడు షిఫ్ట్ల్లో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 8:30 నుంచి 10:30 వరకు, రెండో షిఫ్ట్ 12:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు, మూడో షిఫ్ట్ సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల వరకు నిర్వహించనున్నారు.