గురుకుల విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలి

మోత్కూరు జూలై   జనంసాక్షి : రాష్ట్ర వ్యాప్తంగా గురుకులలో విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచక పోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతలేదనీ విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బాలెంల బాబు మహాజన్ ఆరోపించారు. ఎస్. ఎఫ్.ఐ. జిల్లా అధ్యక్షులు బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ మోత్కూర్ లో ఉన్నటువంటి గురుకులలో విద్యార్థులకు హాస్టల్ సరిపోక అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు అని అన్నారు. తక్షణమే హాస్టల్ ని మార్చాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్. ఎఫ్.ఐ. గా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బిక్షం, నరేష్,మెంట రాజు తదితరులు పాల్గొన్నారు.
Attachments area