గ్యారెంటీ లేని గ్యారెంటీలవి

` సమైక్యవాదులను తరిమికొట్టిన గడ్డ ఇది
` తెలంగాణ వచ్చిన తరవాతనే అభివృద్ది
` మానుకోట ప్రచారంలో మంత్రి హరీశ్‌
మహబూబాబాద్‌(జనంసాక్షి): ఓట్ల కోసం వస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు మానుకోట దమ్మేంటో చూపించాలని మంత్రి హరీశ్‌రావు ఆ నియోజకవర్గ ప్రజలను కోరారు. మహబూబాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్‌ నాయక్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌ షోలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌, బీజేపీల విూటింగులు చూస్తే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని హరీశ్‌రావు తెలిపారు. బీఆర్‌ఎస్‌ విూటింగ్‌ అంటే జన సముద్రంలా ఉన్నాయన్నారు. సమైక్యవాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట ప్రజలు తరిమికొట్టారు. మానుకోటకు మట్టికి, రాళ్లకు దండం అని పేర్కొన్నారు. ఆ దెబ్బతో సమైక్యవాదులు వెనుకకు పరుగెత్తారు. ఇప్పుడు కూడా అలాంటి చైతన్యం రావాలి. తెలంగాణ విూద దండెత్తడానికి వస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు మానుకోట దమ్మేంటో చూపించాలన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సమన్వయంతో పని చేసి శంకర్‌ నాయక్‌ను మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ªూనుకోట రోడ్లు సిద్ధిపేట కంటే బాగున్నాయి. గులాబీ జెండా లేకుంటే మానుకోట జిల్లా అయ్యేదా? మెడికల్‌ కాలేజ్‌ వచ్చేదా? హార్టికల్చర్‌ కాలేజ్‌ వచ్చేదా? తండాలు గ్రామ పంచాయితీలు అయ్యేవా? పోడు భూములకు పట్టాలు వచ్చేవా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు కర్ణాటకలో ప్రచారం చేసి 5 గ్యారంటీలు అని ఊదరగొట్టి మోసం చేశారని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డికి ఏ విషయం విూద పూర్తి అవగాహన ఉండదు. కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్‌ రెడ్డి నెత్తివిూద కట్టాల్నా? బూతులు మాట్లాడే నాయకులు కావాలా? భవిష్యత్తు అందించే నాయకుడు కావాలా? అనేది ప్రజలు తేల్చుకోవాలన్నారు. ªూడు కాల్వల్లో తుమ్మచెట్లు మొలిచినయి.. నేడు రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు వస్తున్నయి.. బోరింగులు మాయమైపోయినయి.. ఇంటింటికీ నల్లా నీళ్లు వస్తున్నాయని హరీశ్‌రావు తెలిపారు. నాడు దొంగ కరెంటు కోసం బాయి కాడ పండుకున్న రోజులు మర్చిపోయిండ్రా? ఉచిత కరెంటు అని చెప్పి ఉత్త కరెంట్‌ చేసింది కాంగ్రెస్‌. కాంగ్రెస్‌ కావాలా? కరెంట్‌ కావాలా? కరెంట్‌ కావాలంటే కారుకు గుర్తుకు ఓటేయాలని మంత్రి సూచించారు. రైతు బంధు విషయంలో కాంగ్రెస్‌ కుట్ర చేసింది. కేసీఆర్‌ చేసిన కృషి వల్ల రైతు బంధు డబ్బులు సోమవారం రోజు ఖాతాల్లో పడతాయని మంత్రి తెలిపారు. రైతులను బిచ్చగాళ్లు అన్న రేవంత్‌ రెడ్డికి రైతులే గుణపాఠం చెప్తరు. ఇప్పటివరకు 90 శాతం హావిూలను నెరవేర్చాం. రుణమాఫీ కూడా త్వరలో పూర్తి చేస్తాం. ఈ దఫా ఇళ్లు కట్టడంపై దృష్టి సారిస్తాం. మూడోసారి గెలిస్తే అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా గుర్తిస్తాం. శంకర్‌ నాయక్‌ మాట కరుకు కానీ మనుసు మంచిది. సిద్ధిపేటకు నేను తేలేని కాలేజీలను శంకర్‌ నాయక్‌ మహబూబాబాద్‌కు తెచ్చుకున్నడు. నా వల్లే కాని పనిని శంకర్‌ నాయక్‌ చేసి చూపించిండు. లంబాడీలకు అత్యధిక ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది కేసీఆరే. ఎస్సీ, ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్‌ ఇచ్చింది కేసీఆర్‌. విూ ఆఖరి డిమాండ్‌ అయిన గిరిజన బంధును ఈ సారి పక్కాగా అమలు చేస్తాం అని హరీశ్‌రావు హావిూ ఇచ్చారు.