గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా చెస్ పోటీలు

నేరేడుచర్ల పట్టణ కేంద్రంలోని గ్రంథాలయంలో  చైర్మన్ గుర్రం మార్కండేయ, మున్సిపల్. వైస్- ఛైర్మెన్, పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీలత రెడ్డి గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా  చెస్ పోటీలను గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీలతరెడ్డి మాట్లాడుతూ పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు చెస్ ఆట ఆడాలని, చెస్ ఆడటం వలన మెదడు చురుకుగా పని చేస్తుందని అన్నారు.చాలా మంది  గ్రంథాలయాలలో చదువుకొని ఉద్యోగాలు పొందినారని, గ్రంథాలయములో అన్ని రకాల కాంపిటేటివ్ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగాలు పొందవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ లైబ్రేరియన్ లలితాదేవి, కార్యదర్శి నక్కగిరిబాబు,కార్యవర్గ సభ్యులు ఎస్కే బషీర్, పిల్లలమర్రి పుల్లారావు, కాలంనాగయ్య, బోరెడ్డి శ్వేత, టిఆర్ఎస్ నాయకులు ఇంజమూరి రాములు, గంట సైదులు, ఇంజమూరి ఎల్లయ్య, ఇంజమూరి రాజేష్, తిక్కల శ్రీకాంత్,షేక్ కైరున్, బి భరత్, తిహారిక్, చైతన్య, అధ్యాపకులు,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.