గ్రామంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలి

మఖ్తల్ ఆగస్టు 09 (జనంసాక్షి) 75 వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు మక్కల్ మండలంలోని గుడిగండ్ల గ్రామంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మరియు జిల్లా జడ్పీ చైర్పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్ కలిసి గ్రామస్తులకు జాతీయ జెండాను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని నింపే విధంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు