గ్రామ రెవెన్యూ సహాయకుల 34వ

నిరవధిక సమ్మె….
వెంకటాపూర్(రామప్ప)ఆగస్టు27 (జనం సాక్షి):-
తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ నిర్ణయం మేరకు మండల కేంద్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులుకు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి 3 హామీలు పే స్కేల్ జీవో మరియు అర్హులైనటువంటి వీఆర్ఏలకు ప్రమోషన్స్ మరియు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని  సెప్టెంబర్ 9 2020 మరియు మార్చి 18 2022 తేదీనకూడా అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగినది.ఇట్టి హామీని నెరవేర్చి జీవోను విడుదల చేసేంతవరకు ఉధృతం చేసి ఈ సమ్మెను కొనసాగిస్తున్నాం.
శనివారం రోజు ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు నిరవధిక సమ్మె దీక్షలు 34వ రోజుకు చేరింది. ఇట్టి సమ్మె వెంకటాపూర్ మండలంలో వీఆర్ఏల నిరవధిక సమ్మెదీక్ష శిభిరం వద్ద ఈరోజు కార్యచరణ కార్యక్రమంలో వీఆర్ఏలు దీక్షా శిబిరం వద్ద పొర్లు దండాలు పెడుతూ కెసిఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని నినాదాలు చేస్తూ
వీఆర్ఏల 34వరోజు నిరసనలు తెలియ పరచడమైనది. వెంకటాపూర్ మండల వీఆర్ఏ పొన్నగంటి శంకర్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  వీఆర్ఏలకు ఇచ్చినటువంటి 3హామీలను పే స్కేల్ జీవోను మరియు అర్హులైన అటువంటి వీఆర్ఏలకు ప్రమోషన్స్ మరియు 55 సంవత్సరాల పైబడిన రిటైర్మెంట్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని చట్టసభలో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినారు. తెలంగాణ రాష్ట్రమంతటా 23వేల మంది వీఆర్ఏలు ప్రతిమండలాల తహశీల్దార్ కార్యాలయం ఎదుటనిరవధిక సమ్మెలో కూర్చొని 34 రోజులు కావస్తున్నా ఈరోజువరకు ఈ ప్రభుత్వం వీఆర్ఏల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఎటువంటి ప్రకటన చేయలేదు.వీఆర్ఏల కోరికలు న్యాయమైనవి మా డిమాండ్స్ ను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసినారు.ఇట్టి 34వ రోజు నిరవధిక సమ్మె నిరసనలో ములుగు జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల రాజయ్య వెంకటాపూర్ వీఆర్ఏలు మండల అధ్యక్షులు నక్క శశి కుమార్,ఉపాధ్యక్షులు తొగరి మురళి,కార్యదర్శి మంతెన స్వప్న,శంకర్ కిషన్ సరిత బిక్షపతి సునీత కుమారస్వామి రాజమౌళి,భాస్కర్,రాజయ్య,శ్రీనాథ్ సమ్మక్క, కిరణ్ మరియు మండల వీఆర్ఏలు అందరూ పాల్గొన్నారు.