ఘణంగా పెత్తరమాస వేడుకలు

మహబుబ్ నగర్ ఆర్ సి ,సెప్టెంబరు 25, (జనంసాక్షి ):  చనిపోయిన పూర్వి కులను స్మరించుకునే పెత్తరమాస పండగను ప్రజలు ఘణంగా  జరుపుకున్నారు. అదివారం  మహబుబ్ నగర్  నియోజక వర్గంలో అన్ని గ్రామాలల్లో ప్రజలు దేవాలయాలు, కుల సంఘాలల్లో అయ్యవార్ల కు దండం పెడుతూ వారి వారి పెద్దలను దేవుళ్ళతో సమానంగా తలుచుకున్నారు. రకరకాల పూలతొ అలంకరించి ,అన్నిరకాల వంటలతో నైవేద్యాలు సమర్పించి భక్తితొ కొలిచారు . హన్వాడ మండలం ముణిమోక్షం ,హన్వాడ ,గొండ్యాల ,వెపూర్ తదితర గ్రామాలలో కుటుంబ సభ్యులు పూర్వీకులను తలుచుకొని వారి ఆత్మలు చల్లగా ఉండాలని దేవుళ్లను  వేడుకున్నారు .
ఫొటొ …
ముణిమోక్షం గ్రామంలో పెతారామస నిర్వహిస్తున్న దృశ్యం .