ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ

జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో లయన్స్ క్లబ్ ట్రెజరర్ రాచకొండ శ్రీనివాస్ నివాసంలో అయ్యప్ప స్వామి వారి పడి పూజ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ పూజ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ , ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.చారి గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన హరిహర సుతుడు అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారణ స్వాములు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం స్వాములకు, భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ , సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీ  మీలా మహదేవ్, బండారు రాజా, మొరిశెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్లు కక్కిరేణి శ్రీనివాస్, గండూరి పావని కృపాకర్ , డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్, చల్లా లక్ష్మికాంత్ , వల్దాస్ జాని,  చల్లా లక్ష్మీప్రసాద్, గుండా శ్రీధర్ , బిక్కుమళ్ల కృష్ణ , కలకోట లక్ష్మయ్య , మీలా వంశీ , యామా ప్రభాకర్, కర్నాటి నాగేశ్వరరావు, భావ్ సింగ్, పోలగాని రాధాకృష్ణ, యామా సంతోష్, తెరటపల్లి సతీష్ , శ్యామ్ సుందర్,  శ్రీరంగం రాము తదితరులు పాల్గొన్నారు. .