ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

మోత్కూరు ఆగస్టు 7 జనంసాక్షి : మోత్కూరు పద్మశాలి కాలనీలో స్ఫూర్తి భవనం ముందు జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చేనేత వృత్తిలో ఉన్నటువంటి వృద్ధాప్య చేనేత కార్మికులు ఆరుగురికి సన్మాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ పద్మశాలీల కులస్తుల అందరికీ పది లక్షల రూపాయలు చేనేత బంధు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని చేనేత కార్మిక సంఘం నాయకులు, పట్టణ పద్మశాలి సంఘం నాయకులు పద్మశాలి కుల బాంధవులు అందరూ పాల్గొన్నారు.