ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వెడుకలు..

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబరు16(జనం సాక్షి):-
కామారెడ్డి జిల్లా కెంద్రంలొ కామారెడ్డి యం యల్ ఎ గంప గొవర్దన్ అద్వరం లొ పాత బస్ బస్టాండ్ నుండి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వరకు మూడున్నర కిలోమీటర్ల మేర 20 వేల మందికి పైగా జాతీయ జెండాను పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,
మాట్లాడారు.తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీను అంగరంగ వైభవంగా,అనుహ్యస్థాయిలో సుమారు 20,000 వేల మందితో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.
ఈకార్యక్రమం ఈస్థాయిలో విజయవంతం కావడానికి ప్రధాన భూమిక పోషించిన కామారెడ్డి నియోజకవర్గ పార్టీ శ్రేణులకు, కలెక్టర్
జితెష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్,డిప్యూటీ కలెక్టర్, రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు ముజిబొద్దన్, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, వేణుగోపాల్ రావు, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీలు శారద, బాలమణి, పిప్పిరి అంజనేయులు, జెడ్ పి టి సి లు తీగల తిరుమల గౌడ్, హనుమాన్లు, రామ్ రెడ్డి, దోమకొండ, బిబిపేట, రాజంపేట, బిక్కనూరు, కామారెడ్డి రూరల్, మాచారెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ శాఖల అధికారులు నియోజకవర్గ స్థాయి అధికారులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు.