ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

మల్దకల్ ఆగస్టు 6 (జనంసాక్షి)

మల్ధకల్ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఎంపీపీ రాజారెడ్డి, జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావం కావడానికి ఆయన చేసిన కృషిని వారు కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి, వైస్ ఎంపీపీ వీరన్న,ఎంపీడీవో కృష్ణయ్య ,ఎంపీ ఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, సూపర్డెంట్ పెద్ద నరసన్న ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటన్న, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సవారన్న, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు నరేందర్, మధు,ప్రభాకర్, కార్యాలయ సిబ్బంది సూర్య ప్రకాష్ రెడ్డి ,రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.