ఘనంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు రాజశేఖర్ జన్మదిన వేడుకలు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు5(జనంసాక్షి):

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు,విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు రాజశేఖర్ జన్మదిన వేడుకలు జిల్లా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ని ట్యాంక్ బండ్ పై ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా హాజరైన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కందనూలు నిరంజన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ నిండు నూరేళ్లు జీవించాలని వికలాంగులకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిదాయ కంగా నీలుస్తారని అన్నారు.వికలాంగుల సేవలో అలుపెలుగని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఎప్పుడు ఫోన్ చేసినా నేనున్నానని పలికే నాయకుడు రాజశేఖర్ మాత్రమే అని అన్నారు.మును ముందు కూడా వికలాంగులకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉండాలని కోరారు. అంతకుముందుకు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్,వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి లు ఫోన్ ద్వారా రాజశేఖర్ కు శుభాకాంక్షలు తెలిపుతూ వికలాంగులకు ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రంలోనే స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నారని అన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎస్సీ కమిటీ జిల్లా ప్రెసిడెంట్ రామ్మోహన్, నాగర్ కర్నూల్ జిల్లా టౌన్ ప్రెసిడెంట్ భీమ్ సాగర్, ప్రధాన కార్యదర్శి బాల పిరు, ఉపాధ్యక్షుడు నిరంజన్, ప్రచార కార్యదర్శి రాము, వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్, మహిళా అధ్యక్షురాలు మల్లమ్మ, మహిళా ప్రధాన కార్యదర్శి అంజనమ్మ, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.