ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన తాలూకా ప్రెస్ క్లబ్ అచ్చంపేట సభ్యులు

అచ్చంపేట ఆర్సి ఆగస్టు 15 జనం సాక్షి న్యూస్ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా స్థానిక పట్టణంలోని తాలూకా ప్రెస్ క్లబ్ 64/2020 ఆధ్వర్యంలో తాలూకా ప్రెస్ క్లబ్ భవనం ముందు సిపిఎం నాయకులతో కలిసి సీనియర్ జర్నలిస్ట్ అనంత రవీందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతీయ సమైక్యతను కాపాడాలని ప్రతి భారతీయుడు జాతీయ భావం తో మెలగాలని సూచించారు. అనంతరం తాలూకా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాలిమూడి ప్రశాంత్ కుమార్ తో కలిసి విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు అందజేయడంతో పాటు స్థానిక ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్ మల్లేష్ శంకర్ దేశ నాయక్ మీడియా మిత్రులు కపిలవాయి పవన్ కుమార్ ,సంబు చంద్రశేఖర్, వంగ రవీందర్ గౌడ్, సాదిక్, గుండోజు స్వామి, హరీష్ ,రామలింగం ,బృందావన్ ,తాహెర్, సామాజిక కార్యకర్త జరపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.