ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలు.

దౌల్తాబాద్ మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ చౌరస్తాలో హిందూ సామ్రాజ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక చత్రపతి శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటరాని హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడుగా పేరుగాంచిన వీరుడు ఛత్రపతి శివాజీ అని చత్రపతి శివాజీ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వయం సేవకులు చెంద్రశేఖర్,అది వేణు,పెంటయ్య,మనోహర్,రమేష్,కోనేరు వేణు, నర్సింలు,యాదగిరి, వీరేష్, నాగరాజు,రెడ్డిశ్రీను, నరేష్, మహేష్, అరుణ్,స్వామి,తదితరులు పాల్గొన్నారు.