ఘనంగా 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు:15 మండలంలోని సాతారం గ్రామంలో ఈరోజు ఘనంగా భారతీయ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు అలాగే భారత స్వతంత్ర వజ్రోత్సవ సందర్భంగా విద్యార్థులచే నూట ఇరవై మీటర్ల పొడవు గల జాతీయ జెండాను రహదారులపై భారత మాత కి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు సుమలత మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చి ఇప్పటికీ 75 స్వతంత్ర దినోత్సవ జరుపుకున్న సందర్భం ఎంతో అనుభూతిని ఇచ్చిందని అలాగే మన భారతదేశాన్ని అన్ని రంగాలలో మనం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంచడానికి విద్యార్థినిలు, విద్యార్థులు, యువతరం ముందుకు వెళ్లాలని అన్నారు. ఎంపీటీసీ గున్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్కడున్నా మన భారతదేశం పేరు చెప్తేనే గర్వించేలా ఉండాలని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమేష్ డి రవీందర్ వీడిసి చైర్మన్ నర్సయ్య ఉప సర్పంచ్ మెడకోకుల శ్రీనివాస్ కార్యదర్శి వినోద్ కుమార్ ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు విద్యా కమిటీ చైర్మన్ లు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు