ఘుజియాబాద్‌లో దుండగుల దాడి.. ఏడుగురి మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ న్యూసిటీలో ఓ కుటుంబంపై మారణాయుధాలతో దుండగులు దాడికి దిగారు. ఈ దాడిలో ఆ కుటుంబంలోని ఏడుగురు మృతి చెందారు. ఆస్తి తగాదాలే ఈ ఘటనకు కారణమని బంధువులు అంటున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.