చట్టబద్ధంగా అర్హులయిన ప్రతి ఒక్కరికి సాయం

సెప్టెంబరు 26 (జనం సాక్షి)

 

నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది ..నిబంధనలకు లోబడి అందరికీ పరిహారం

మీ త్యాగాన్ని ప్రభుత్వం ఎన్నడూ తక్కువ చేసి చూడదు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రకారం లక్షల ఎకరాలకు సాగునీరా అందించేందుకు మీరు భూములు త్యాగంచేయడం అభినందనీయం

మీరు కోరిన విధంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం

అర్హులయిన ప్రతి ఒక్కరికీ ఇండ్ల ప్లాట్లు

ఆర్ & ఆర్ సెంటర్ లో పాఠశాల, పశు వైద్యశాల, ఆరోగ్య ఉపకేంద్రం, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాల ఏర్పాటు

ప్రభుత్వపరంగా మీకు అందే ప్రతి సాయం అందేలా చూస్తాం

చేపల సంఘం ఏర్పాటుకు సహకార శాఖలో నమోదు చేసుకోవాలి

దసరా తర్వాత కొంకలపల్లి గ్రామస్తులు ఆర్ & ఆర్ సెంటర్ లో ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టుకోవాలి

బండరావిపాకుల ఆర్ & ఆర్ సెంటర్ లో నూతనంగా నిర్మించిన పశు వైద్యశాల, ఆరోగ్య ఉపకేంద్రం, గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభం

నిర్వాసితులకు అందుబాటులో ప్రభుత్వ సేవలు

గోపాల్ పేట మండలం ఏదుట్లలో నూతన గ్రామపంచాయతీ ప్రారంభించి, రేవల్లి మండలకేంద్రంలో సర్వవర్గ సామూహిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఏదుల వీరాంజనేయ రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన బండరావిపాకుల ఆర్ & ఆర్ సెంటర్ లో నూతన ప్రభుత్వ భవనాలు ప్రారంభించి, కొంకలపల్లి ఆర్ & ఆర్ సెంటర్ పరిశీలించి, నిర్వాసితులకు ప్లాట్లను పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, సీఈ హమీద్ ఖాన్, జేసీ వేణుగోపాల్, డీఈ సత్యనారాయణ గౌడ్ తదితరులు