చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేసిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేసింది. ఉత్తరకాశీ, బదరీనాథ్‌, హిమకుంద ప్రాంతాల్లో రహదారిపై కొండ చరియలు విరిగిపడటంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో 41 వేల మంది యాత్రికులు అవస్థులు పడుతున్నారు.