.చాుకానున్న రౖుె..`
న్యూదిల్లీ,మే 10(జనంసాక్షి):కరోనా వైరస్ కారణంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. దేశ వ్యాప్తంగా బస్సు, రైళ్లు, విమాన రాకపోకు నిలిచిపోయాయి. తాజాగా లాక్డౌన్ మూడోసారి మే 17వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపు ఇస్తోంది. ఇప్పటికే వస కూలీను శ్రామిక్ రైళ్ల ద్వారా వారి గమ్య స్థానాకు చేరుస్తోంది. తాజాగా మే 12వ తేదీ నుంచి దశ వారీగా పాసింజర్ రైళ్లను కూడా నడపాని రైల్వేశాఖ నిర్ణయించింది. దిల్లీ నుంచి 15 సర్వీసును ప్రత్యేక రైళ్లుగా దేశంలోని 15 ముఖ్య నగరాకు నడపనున్నారు.దిల్లీ నుంచి ఇతర ప్రాంతాకు(15 రైళ్లు) అక్కడి నుంచి నుంచి దిల్లీకి(15 రైళ్లు) మొత్తం 30 రైళ్లను నడపాని నిర్ణయించారు. దిల్లీ నుంచి దిబ్రూఘర్, అగర్తలా, హౌరా, పట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావికు అక్కడి నుంచి దిల్లీకి ఈ రైళ్లు తిరగనున్నాయి. దీని తర్వాత రైల్వే కోచ్ు అందుబాటులో ఉన్న దానిని బట్టి ప్రత్యేక రైళ్లు నడిపే విషయమై నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే 20వే కోచ్ను కొవిడ్`19 కేర్ సెంటర్లుగా మార్చిన సంగతి తెలిసిందే. మరోవైపు రోజూ 300 శ్రామిక్ రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది.ఇక పాసింజర్ రైళ్లలో రిజర్వేషన్లు మే 11వ తేదీ సాయంత్రం 4గంట నుంచి మొదవుతాయి. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను మూసే ఉంచుతారు. కన్ఫార్మ్ అయిన టికెట్లు కలిగిన ప్రయాణికుకు మాత్రమే రైల్వే స్టేషన్లోకి అనుమతి ఉంటుంది. ప్రయాణికు తప్పనిసరిగా మాస్క్, ధరించి, స్క్రీనింగ్కు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రయాణానికి అనుమతి ఇస్తారు. కరోనా క్షణాు లేని వారికి మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.