చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏర్పేడు(చిత్తూరు): చిత్తూరు జిల్లా ఏర్పేడు మండల కేంద్రం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. సీతారాంపేట గ్రామం సమీపంలో కారు, లారీ ఢీకొనగా ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులను గుంటూరు జిల్లా మాచవరం మండలం జంగిరెడ్డి పాలెం గ్రామ వాసులుగా గుర్తించారు. వీరంతా కారులో తిరుమల వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఒకరిని ఆస్పత్రికి తరలించారు.