చిన్నారులను ఆశీర్వదించిన సునీతా లక్ష్మారెడ్డి

శివ్వంపేట సెప్టెంబర్ 19 జనంసాక్షి : మండల పరిధిలోని చెన్నాపూర్ గ్రామానికీ చెందిన బోళ్ల యాదమ్మ – కిష్టయ్య దంపతుల కూతుర్లు తన్వయశ్రీ, తనుశ్రీ, కుమారుడు ప్రణయ్ నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం సోమవారం మండల పరిధిలోని సికింద్లాపూర్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద గల లక్ష్మీ నరసింహ గార్డెన్స్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి హాజరై చిన్నారులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చెన్నాపూర్ సర్పంచ్ బోల్ల భారతి బిక్షపతి, ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు రామచంద్రం గౌడ్, పారిశుధ్య కమిటీ చైర్మన్ బోళ్ల ఆంజనేయులు, యుద్ధంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ యాదవ్, మల్లేష్, శ్రీనివాస్, ఆశ వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు గోపమ్మ, సబిత, రేణుక, లావణ్య, భూలక్ష్మీ, పద్మ, తదితరులు పాల్గొన్నారు.