చైనా కోళ్ల పరిశ్రమలో అగ్నిప్రమాదం:119

మంది మృతి
బీజింగ్‌ : ఈశాన్య చైనా ప్రాంతంలోని ఒక కోళ్ల పరిశ్రమలో సోమవారం సంభవించిన అగ్నిప్రమాదంలో 119 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు 300 మంది దాకా కార్మికులు పరిశ్రమలో ఉన్నట్లు సమాచారం. మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపడుతున్నారు. రసాయనాలు లీకవడం వల్ల పేలుడు జరిగి అగ్నిప్రమాదానికి దారితీసినట్లు భావిస్తున్నారు. గత పన్నెండేళ్లలో ఇంత తీవ్రస్థాయిలో అగ్నిప్రమాదం జరగడం ఇదే ప్రథమమని అధికారులు అంటున్నారు.