చేనేత సంఘం ఎలక్ట్రానిక్ మీడియా విభాగం కార్యదర్శిగా గుర్రం మల్లేశం

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 5 (జనంసాక్షి) హైదరాబాద్ లోని జాతీయ చేనేత ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో మండలం లోని పల్లెర్ల గ్రామానికి చెందిన గుర్రం మల్లేశంను రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా విభాగం కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ జాతీయ స్థాయిలో చేనేత కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు