చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా కొనసాగింది

తాండూరు పట్టణం: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ విపక్షాలు చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ అధికారులు బస్సులను నడపడానికి ప్రయత్నించగా తెదేపా, తెరాస నాయకులు అడ్డుకున్నారు. రెండు పార్టీల నాయకుల అభ్యంతరంతో అధికారులు బస్సులను నిలిపివేశారు. బస్సులు బయటకు రాకుండా తెదేపా ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే దారిలో బైఠాయించారు. పట్టణంలో వ్యాపార, విద్యా సంస్థలు, సినిమా థియేటర్‌లు, పెట్రోలు బంకులు మూతపడ్డాయి.