చైనాలో బస్సులో మంటలు.. 42 మంది మృతి

బీజింగ్‌ : చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పుజియాస్‌ ప్రాంతంలోని గ్జియామెస్‌ సిటీలో వేగంగా వెళ్తున్న ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 42 మంది మృతి చెందారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.