చైనా వెళ్లే భారత్ బృందానికి చంద్రబాబు నాయకత్వం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి20 ( జనంసాక్షి)
: చంద్రబాబు నాయుడు అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. భారత్ తరఫున చైనా వెళ్లే ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహంచ బోతున్నారు. భారత్- చైనా సత్సంబంధాలు పెంపొందించేందుకు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక పాత్ర పోషించనున్నారు. ఏప్రిల్ 1నుంచి 6 వ తేదీ వరకు చైనాలో పర్యటించే భారత ప్రతినిధుల బృందానికి ఆయన నేతృత్వం వహించనున్నారు. తమతో సత్సంబంధాల కోసం ప్రతినిధుల బృందాన్ని పంపాల్సిందిగా చైనా ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని ఆహ్వానించింది. ఈ బృందానికి నేతృత్వం వహించమని కేంద్ర విదేశాంగ శాఖ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసింది. దీనికి చంద్రబాబు అంగీకరించారు.
.
గొన్నారు.