చోరీ చేసిన దుండగుడికి స్థానికుల దేహశుద్ది

ఖమ్మం, సెప్టెంబర్ 5 : జిల్లాలోని ఇల్లందులో చోరీ చేసిన దుండుగుడికి స్థానికులు దేహశుద్ది చేశారు. ఇల్లందులో నివాసం ఉంటున్న నజీం ఇంట్లో ఓ దొంగ మూడు రోజుల క్రితం దొంగతనం చేశాడు. మూడు తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్రవాహనాన్ని అపహరించాడు. ఈరోజు తెల్లవారుజామున దొంగలించిన బైక్‌పై చోరీ చేసిన ఇంటివైపు దొంగ వెళ్లాడు. వాహనాన్ని గుర్తుపట్టిన నజీం కుటుంబసభ్యులు దొంగను వెంటపడి పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.