ఛత్తీస్‌గఢ్‌ పీసీసీ చీఫ్‌గా చరణ్‌దాస్‌ మహంతా

రాయ్‌పూర్‌,(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ పీసీసీ తాత్కాలిక అధ్యక్షుడిగా చరణ్‌దాస్‌ మహంతి నియమితులయ్యారు. ఆయనను పీసీసీ అధ్యక్షునిగా నియమిస్తూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 25న మావోయిస్టుల దాడి జరిపి ఛత్తీస్‌గఢ్‌ పీసీసీ చీఫ్‌ నందకుమార్‌ పటేల్‌ను హతమార్చిన నేపథ్యంలో చరణ్‌ను పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ సోనియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ దాడిలో సల్వాజుడుం నేత మహేంద్ర కర్మతో పాటు 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.