జంతర్‌మంతర్‌లో అన్నాహజారే దీక్ష

8pji3h6fన్యూఢిల్లీ : హస్తినలోని జంతర్‌మంతర్‌లో సామాజిక ఉద్యమకారులు అన్నాహజారే మరోసారి దీక్ష చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన భూ సేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రైతు సంఘాలతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు అన్నాహజారే. ఈ సందర్భంగా అన్నా మాట్లాడుతూ.. భూసేకరణ ఆర్డినెన్స్ రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. కార్పోరేట్‌లకు మేలు చేసేలా భూసేకరణ ఆర్డినెన్స్ ఉందన్నారు. ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని అన్నా డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.