జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల  (జనంసాక్షి) ఆగస్టు 6 :

జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణలో రూ. 35 లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన జంతు జనన నియంత్రణ కేంద్రం ను జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు.
శనివారం జిల్లాలో 31వ వార్డ్ పరిధిలోని జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణలో జంతు జనన నియంత్రన కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ జిల్లా లో మొదటి సరిగా జంతు జనన నియంత్రణ కేంద్రంను ప్రారంభించడం జరిగిందన్నారు. కుక్కలు, కోతుల బెడద రోజు రోజుకు పెరిగిందని, దీంతో వృద్ధులు, వికలాంగులు చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం పురపాలక, వెటర్నరీ సమన్వయంతో జంతు జనన నివారణకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో కుక్కలు, కోతులు ఎక్కువ ఉంటే వెంటనే పురపాలక సిబ్బందికి నేరుగా సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం అన్ని విధాలుగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, జిల్లా వెటర్నరీ అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమీషనర్ జానకిరామ్ సాగర్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్, , తదితరులు పాల్గొన్నారు.