జమ్మూకశ్మీర్ లో ఘోర ప్రమాదం

జమ్మూకశ్మీర్ లోని కిష్టావర్ లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం (ఆగస్టు-21) మాచెల్ మాతా దర్శనానికి వెళ్తున్న భక్తుల వాహనం అదుపుతప్పి చీనాబ్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఐదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడటంతో.. ఆ చిన్నారిని ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. సంఘటన స్థలం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు జమ్మూలో రోడ్డన్నీ పాడయ్యాయని, దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు చెబుతున్నారు పోలీసులు.