జర్నలిస్టుల కార్డుల ఆన్లైన్ గడువు పెంచాలి -ఐజెయూ జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్

మహబూబాబాద్ బ్యూరో-జూన్1 (జనంసాక్షి)

జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులకు దరఖాస్తు చివరి తేదీని పెంచాలని టీ యూడబ్ల్యూజె (ఐజెయూ) జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రిడేషన్ కోసం ఆన్లైన్ ప్రక్రియ సమయం జూన్ నాలుగు వరకు ఇవ్వడంతో ఆ సమయం సరిపోక జర్నలిస్టుల ఇబ్బందులు ఎదురుకునే పరిస్థితి ఉందని సమయాన్ని పొడిగించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని మీడియా సంస్థలు వారి సంస్థలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు రికమండేషన్ లెటర్లు త్వరగా ఇచ్చి సహకరించాలని కోరారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ప్రధానం కనుక అందరికి న్యాయం జరిగేలా చూడాలని అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల విషయంలో ఐజెయూ పూర్తిగా సహకారం అందుతుందని శ్రీనివాస్ తెలిపారు.