జాతీయ జెండాల పంపిణీ

జనగామ టౌన్,ఆగస్టు10(జనంసాక్షి)
భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75  సంవత్సరాలు అయిన సందర్భంగా భారత ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఆజాది  క అమృత్ మహోత్సవం సందర్భంగా జనగామ పట్టణం లోని  గిర్నిగడ్డ ప్రాంతంలో 8,9 వార్డులలో  బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు బింగి రమేష్  ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని హర్ ఘర్ తిరంగా జండా నినాదంతో జాతీయ జెండాల పంపిణీ చేస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంగ నరేష్, ఆరూరి భాస్కర్, నారగోనిరఘురాం ,చెమిటి నరేష్, గౌరగల్ల ప్రభాకర్, మాచర్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.