జిల్లా కమిటీలో చోటు దక్కించుకున్న నాయకులను సన్మానించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జిల్లా కమిటీలో చోటు దక్కించుకున్న నాయకులను సన్మానించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి, మంథని ,అక్టోబర్ 17 : పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీలో చోటు దక్కించుకున్న మంథని మండలానికి చెందిన నాయకులను మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంగళవారం శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా నియామకమైన ఆరెంద గ్రామానికి చెందిన నూకల బాలయ్యను, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకమైన రచ్చపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జనగామ నర్సింగారావు ను, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకమైన వెంకటాపూర్ మాజీ ఎంపిటిసి కొడుదుల వెంకన్నను, జిల్లా కార్యదర్శిగా నియామకమైన గుంజపడుగు గ్రామానికి చెందిన ఊదరి శంకర్ శ్రీధర్ బాబు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ… రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను కలుపుకొని పోయి పని చేయాలని సూచించారు