జిల్లా వైసీపీ కమిటీల నియామకం

ఖమ్మం,మార్చి30(జ‌నంసాక్షి): ఎస్‌ఆర్‌ కారగ్రెస్‌ పార్టీ జూలూరుపాడు మరడల ప్రధాన కార్యదర్శిగా మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెరదిన మాజీ సర్పంచ్‌, మాజీ మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఎదళ్లపల్లి వీరభద్రాన్ని నియమిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెరకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఏన్కూరు మండలంలోని జెన్నారం గ్రామానికి చెందిన స్వర్ణ ప్రహ్లాదరావును నియమిస్తూ పాయం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కార్మిక విభాగర జిల్లా కార్యదర్శిగా జూలూరుపాడుకు చెందిన కంచర్ల రాఘవేందర్‌రావును, విద్యార్థి విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శిగా అదే గ్రామానికి చెందిన ఎస్‌కె.చాంద్‌ పాషాను నియమించారు. ఈ మేరకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయం నురడి బుధవారర ఒక ప్రకటన విడుదలైంది. తమపై నమ్మకంతో పార్టీలో సముచిత స్థానం కల్పిరచిన పార్టీ తెలరగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మర పార్లమెరటు సభ్యుడు పొరగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, పినపాక శాసనసభ్యుడు పాయం వెరకటేశ్వర్లు, వైరా, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బొర్రా రాజశేఖర్‌, పార్టీ జిల్లా కార్యదర్శి చంరడ్ర నరేందర్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు పూర్ణకంటి నాగేశ్వరరావు, ఏన్కూరు, జూలూరుపాడు మండల వైసీపీ అధ్యక్షులు ముక్తి వెరకటేశ్వర్లు, అల్లాడి నర్సింహారావులకు నూతనంగా నియమితులైన వారు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంపీ పొరగులేటి సారధ్యంలో పోరాటాలను ముమ్మరం చేస్తామని వారు హావిూ ఇచ్చారు.