జీడిమెట్లలో పేలుడు..నలుగురికి గాయాలు

హైదరాబాద్‌, జూలై 13: జీడిమెట్లలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని ఒక డ్రగ్స్‌ కంపెనీలో శుక్రవారం ఉదయం రసాయనాలతో ఉన్న డ్రమ్ములు పేలాయి. ఆ సమయంలో అక్కడే విధి నిర్వహణలో ఉన్న నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. మిగిలిన వారు హాహాకారాలు చేస్తూ వెలుపలకు పరుగులు తీశారు. అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. గాయపడిన నలుగురు కార్మికులను ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.