జూబ్లీహిల్స్‌లో ఈవీఎంలు మొరాయింపు

హైదరాబాద్‌ నగరం జూబ్లీహిల్స్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రంలోని 153 బూత్‌లో ఈవీఎం మొరాయించింది. సిబ్బంది ఈవీఎంను సరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటు వేసేందుకు పలువురు ఓటర్లు బారులు తీరారు. టాలీవుడ్‌ అగ్ర నటుడు అల్లు అర్జున్‌ సైతం ఓటు వేసేందుకు క్యూలైన్‌లో నిల్చున్నారు.