జేడీయూ భాజపాతో విడిపోవడం దురదృష్టకరం

సుష్మా స్వరాజ్‌

ఢిల్లీ : భాజపా, జేడీయూల మైత్రీబంధం విచ్ఛిన్నమవడం పట్ల భాజపా సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ విచారం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర సంఘటన అని అమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాము జేడీయూతో బంధం కొనసాగించాలనుకున్నామని మరో నేత ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ తెలిపారు. తమ పార్టీ సొంత నిర్ణయాలు తీసుకుంటుందని, వాటిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్న  ఆయన మోడీ నియామకంపై వెనక్కి తగ్గేది లేదన్నారు.