జొన్నగావ్ లో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాణి క్ రావు

 

 

 

 

 

ఝరాసంగం సెప్టెంబర్ 29 (జనం సాక్షి) మండలం లోని జునేగావ్ గ్రామం లో 10 లక్షల సిడిపి, 20 లక్షల రూపాయల ప్రత్యేక అభివృద్ది నిధులతో సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేసిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అనంతరం అర్హులైన 57 సంవత్సరాలు నిండిన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ ధృవపత్రాలన బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మెన్ పెంటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నర్సిములు పటేల్, మాజీ మండల అద్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు జగదీశ్వర్, రైతు సమన్వయ అద్యక్షులు సుభాష్ రావు, సర్పంచ్ బోయిని విజయ కృష్ణ, నాయకులు బస్వరాజ్, బశ్వరజ్, సంగమేష్ పాటిల్, నర్సింలు, వీరన్న పటేల్, బక్కన్న, మల్లికార్జున్ పటేల్, శివన్న పటేల్ వివిధ గ్రామాల సర్పంచ్ లు కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.