జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

తెలంగాణ రాష్టంలో ఉన్న ఏకైక శక్తి పీఠమైన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని 5వ శక్తి పీఠం  శ్రీ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను మంగళవారం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  దంపతులు  దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు అయనకు  ఘనస్వాగతం పలికారు. అనంతరం ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.  ఆలయ అర్చకులు ఆయనను శాలువ, పూలమాలతో సత్కరించి ఆలయ విశిష్టతను తెలిపి తీర్థం ప్రసాదం అందజేశారు. ఈయన వెంట కొల్లాపూర్   టిఆర్ఎస్
నాయకులు పాల్గొన్నారు.