జోగులాంబ అమ్మ వారిని దర్శించుకున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు

  అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 30) మహా శక్తి  పీఠలలో ఒకటైన జోగులాంబ బాలబరమేశ్వర స్వామి ఆలయాలను  శుక్రవారం దసరా నవరాత్రులలో ఐదవ రోజు స్కందమాత దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దేవినవరాత్రుల  సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ దర్శించుకున్నారు.ఆమేకు ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,కార్యనిర్వహణాధికారి పురేందర్ కుమార్ ఆలయ ప్రధానఅర్చకులు ఆనంద్ శర్మలు  పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను శాలువా, పూలమాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి లతో పాటు, పెద్ద సంఖ్యలో బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area