జోగులాంబ నుదర్శించుకున్న రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ డొబ్రియల్

అలంపూర్ ఆగస్టు 6 జనం సాక్షి

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయా లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ డోబ్రీయల్ శనివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధానార్చకులు ఆనంద్ శర్మ, ఆలయాధికారి రంగనాథం స్వాగతం పలికారు. అనంతరం ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వీరికి శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.వీరితో పాటు కన్సర్వేటర్ మహబూబ్ నగర్ సర్కిల్ క్షితీజా, జోగులాంబ గద్వాల్ మరియు వనపర్తి జిల్లా అటవీ శాఖ అధికారి రామకృష్ణ, గద్వాల ఫారెస్ట్ రేంజ్ అధికారి దేవరాజ్ లు వున్నారు.