జోగులాంబ సన్నిధిలో జిల్లా అదనపు ఎస్పీ

జోగులాంబ సన్నిధిలో జిల్లా అదనపు ఎస్పీ అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 30) మహా శక్తి పీఠలలో ఒకటైన జోగులాంబ బాలబరమేశ్వర స్వామి ఆలయాలను శుక్రవారం దసరా నవరాత్రుల సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ రాములు నాయక్ దర్శించుకున్నారు.జిల్లా అదనపు ఎస్పీ కు ఆలయ కార్యనిర్వహణాధికారి పురేందర్ కుమార్ ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను శాలువా, పూలమాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.